మాస్ మహారాజా రవితేజ గత కొంతకాలం నుంచి సినిమాలకు రెమ్యునరేషన్ కాకుండా విడుదల తర్వాత వచ్చే షేర్ లో కొంత వాటాను తీసుకుంటున్నారు. అలా క్రాక్ సినిమాకు రవితేజ దాదాపు రూ. 15 కోట్లను సొంతం చేసుకున్నాడు. సాధారణంగా ఈయన ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునేవారు.
కానీ ఇలా షేర్ లో వాటాను తీసుకోవడం వల్ల ఎక్కువ లాభపడటంతో.. తన తదుపరి చిత్రాలు ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీలకు ఇదే తరహాలో డీల్ కుదుర్చుకున్నారు. కానీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. దీంతో రవితేజ తన తాజా చిత్రం `ధమాకా` విషయంలో రిస్క్ చేయడానికి మొగ్గు చూపులేదట. సేఫ్ గా రెమ్యునరేషన్ తీసుకోవడమే బెటర్ అని భావించారట.
ఈ నేపథ్యంలోనే ధమాకా సినిమా కోసం రూ. 7 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని సేఫ్ గా సైడ్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. కాగా, ధమాకా విషయానికి వస్తే.. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 23న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.