టాలీవుడ్ లో సంక్రాంతి హడావుడి చాలా గట్టిగానే ఉంది. ప్రతి సంవత్సరానికి భిన్నంగా వచ్చేచే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల పోటీ తీవ్రంగా ఉండబోతుంది. వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరితో పాటు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా వచ్చే సంక్రాంతి బరిలో నిలవనున్నాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఈ మూడు సినిమాల నిర్మాతల మధ్య గట్టి పోటీ నెలకొంది.
ముందుగా చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. విజయ్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఈ సినిమాపై టాలీవుడ్ లో ఓ వర్గం కొంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. దిల్రాజు ఈ సినిమాను డబ్బింగ్ సినిమాగా విడుదల చేయడంతో డబ్బింగ్ సినిమాలు సంక్రాంతి సీజన్లో విడుదల చేయకూడదని టాలీవుడ్ నిర్మాతల మండలి సభ్యులు బహిరంగ లేఖను విడుదల చేశారు.
ఇక ఈ విషయంపై దిల్ రాజు ఎటు స్పందించలేదు. ఈ ప్రెస్ నోట్ పై టాలీవుడ్ లో కూడా భిన్నభిప్రాయాలు వస్తున్నాయి. దిల్ రాజుకు సపోర్టుగా టాలీవుడ్ లో మరో అగ్ర నిర్మాతలైన అల్లు అరవింద్, అశ్వినీదత్ సపోర్ట్ గా కామెంట్లు చేయడంతో ఇప్పుడు ఇది టాలీవుడ్ నిర్మాతల మండలి వర్సెస్ సీనియర్ నిర్మాతలుగా మారింది.
ఈ సీనియర్ ప్రొడ్యూసర్లు ఈ విధంగా కామెంట్లో చేయడంతో మిగిలిన ప్రొడ్యూసర్లు కూడా ఆ సీనియర్ ప్రొడ్యూసర్ల మాటలకు సపోర్టుగా నిలవడంతో దిల్ రాజు సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చేసినట్లు అయింది. ఇక దిల్ రాజు కూడా అన్ని సమస్యలు క్లియర్ అవడంతో సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించాడు. దీంతో నిర్మాతరల మండలి తీసుకున్న నిర్ణయం కాస్త గాల్లో కలిసిపోయింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.