గత రాత్రి సీనియర్ యాక్టర్ పవిత్ర లోకేష్ తనకు… సీనియర్ యాక్టర్ నరేష్ కు సంబంధం ఉంది అంటూ వస్తున్న సోషల్ మీడియా వార్తలు, యూట్యూబ్ వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు పై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే 8 యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్స్కు నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన వారు మూడు రోజుల్లో విచారణకు హాజరు అవ్వాలని పేర్కొన్నారు.
పవిత్ర లోకేష్ ఈ మధ్యకాలంలో సినిమాల కన్నా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక పవిత్రా లోకేష్ తన కంప్లైంట్ లో సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ మధ్య ఏదో రిలేషన్ ఉందని అవస్తవాలను ప్రచారం చేస్తూ తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆమె పేర్కొంది.
తమ ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తున్నారని పవిత్ర ఆరోపించింది. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ తన ఇమేజ్ను డామేజ్ చేస్తున్నారని కంప్లైంట్ లో పేర్కొంది. ఇక అలా తన వ్యక్తిగత విషయాలపై తప్పుడు వార్తలు రాసిన వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్ పై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ కంప్లైంట్ పై విచారణ చేపట్టిన పోలీసులు పవిత్ర లోకేష్ పై అసభ్యకరమైన పోస్ట్లు, వీడియోలు పెట్టిన వారికి నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఏదేమైనా ఇప్పటి వరకు తనను ఎంత ట్రోల్ చేసినా పట్టించుకోని పవిత్రా ఒక్కసారిగా జూలు విదిల్చి సోషల్ మీడియా వాళ్లను టార్గెట్ చేసిందన్న చర్చలు నడుస్తున్నాయి.