ఉత్తరాంధ్రలో రాజకీయంగా లబ్ది పొందడమే లక్ష్యంగా మూడు రాజధానుల కాన్సెప్ట్లో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని పేరుతో వైసీపీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. పేరుకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి అని చెబుతున్నారు గాని..రాజకీయం తెలిసినవారికి..వైసీపీ చేసేది రాజకీయం అని క్లియర్గా అర్ధమవుతుంది. ఎందుకంటే గత మూడున్నర ఏళ్లుగా అధికారంలో కొనసాగుతుంది వైసీపీనే. మరి కాలంలో విశాఖలో గాని, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గాని వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటి? అంటే ఏమో అక్కడ ప్రజలకే కాదు..రాష్ట్ర ప్రజలకు కూడా కనబడలేదు.
మొత్తానికి రాజధాని కాన్సెప్ట్ అనేది ఉత్తరాంధ్రలో టీడీపీని దెబ్బతీసి వైసీపీ లబ్దిపొందడానికి..ప్రధానంగా విశాఖలో. మరి ఆ దిశగా వైసీపీకి ప్లస్ అవుతుందా? అంటే ప్లస్ కంటే మైనస్ కనిపిస్తోంది. వైసీపీ చేసే పోరాటం రాజకీయం అని అక్కడి ప్రజలకు అర్ధమవుతుంది. పైగా టీడీపీ-జనసేన కలవడం దాదాపు ఫిక్స్ అయింది. ఇక ఈ రెండు పార్టీలు కలిస్తే విశాఖలో వైసీపీకి పెద్ద డ్యామేజ్. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో వైసీపీకి పాడేరు, అరకు, మాడుగుల, చోడవరం సీట్లలోనే అనుకూలత ఉంది.
టీడీపీకి విశాఖ ఈస్ట్, నార్త్, వెస్ట్, నర్సీపట్నం, పాయకరావుపేట సీట్లలో ప్లస్ ఉంది. అయితే టీడీపీ-జనసేన పొత్తు బట్టి..టీడీపీకి అనుకూలంగా ఉండే ఐదు సీట్లతో పాటు..భీమిలి, గాజువాక, అనకాపల్లి, ఎలమంచిలి, విశాఖ సౌత్, పెందుర్తి సీట్లలో వైసీపీకి డ్యామేజ్ తప్పదు. పొత్తు ప్రభావం చోడవరం నియోజకవర్గంపై కూడా ఉంటుంది.
మొత్తానికి చూసుకుంటే విశాఖలో 15 సీట్లు ఉంటే టీడీపీ-జనసేన పొత్తు వల్ల 12 సీట్లలో వైసీపీకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కేవలం అరకు, పాడేరు, మాడుగుల సీట్లలో వైసీపీకి పాజిటివ్ కనిపిస్తోంది. పొత్తు గాని లేకపోతే విశాఖలో మెజారిటీ సీట్లు వైసీపీనే గెలుచుకునే ఛాన్స్ ఉంది. కానీ పొత్తు దాదాపు ఖాయమయ్యేలా ఉంది. కాబట్టి రాజధాని సెంటిమెంట్ ఎంతగా లేపిన విశాఖలో వైసీపీకి రిస్క్ ఎక్కువే.