కొత్త ఇల్లు కొన్న మాధురీ దీక్షిత్‌.. ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

మాధురి దీక్షిత్ ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్గా మరియు మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకుంది. కొన్నాళ్లపాటు తన పాటలు, డాన్సులు, సినిమాలతో అటు నార్త్ లోనే కాదు ఇటు సౌత్ లో కూడా మాధురి దీక్షిత్ పేరు మారుమోగిపోయింది. ఈమె ప్రస్తుతం సినిమాలతో పాటు ఇటు బుల్లితెరపై కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ ముంబైలోని లోయర్ పరేర్ ప్రాంతంలో ఒక లగ్జరియాస్ ఇల్లును కొన్నది. అయితే 53వ అంతస్తులో ఉన్న ఈ కొత్తింటిని దాదాపు 48 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 5384 చదరపు గజాల ఉన్న ఈ కొత్త ఇంట్లో స్విమ్మింగ్ పూల్స్, ఫుట్బాల్ పీచ్, క్లబ్, జిమ్, స్పా వంటి ఎన్నో విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయని సమాచారం. అంతేకాకుండా మాధురీ దీక్షిత్ కొత్తింటి నుండి అరేబియా సముద్రం వ్యూ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందని సమాచారం. ప్రస్తుతం మాధురి దీక్షిత్ కొన్న కొత్తింటి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాధురి దీక్షిత్ 5 పదుల వయసులో కూడా ఆంటీ అంటే ఎవరు నమ్మని విధంగా ఫోటోలకి ఫోజులిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది.