దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాలతో తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయి సినిమాల దృష్టికి తీసుకువెళ్లాడు. ఆ సినిమాలతో ఆయనకు ప్రపంచ స్థాయి దర్శకుడు అనేఇమేజ్ కూడా వచ్చింది. ఇక ఆ సినిమాల తర్వాత రాజమౌళి ఎంతో ప్రెస్టీజియస్ గా టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి త్రిబుల్ ఆర్ సినిమా తీశాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులను సృష్టిస్తూనే ఉంది. సినిమా రిలీజ్ అయ్యి ఏడెనిమిది నెలలు దాటినా త్రిబుల్ ఆర్ సినిమా మ్యానియా ఇప్పటికీ తగ్గలేదు.
ఇప్పటికీ ఎక్కడో ఒక దగ్గర నుంచి ఈ సినిమాకి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా అయితే అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో దర్శక ధీరుడు రాజమౌళి సమక్షంలో ఓ భారీ స్పెషల్ షో ను ప్లాన్ చేయగా అషోకు అక్కడున్న విదేశీ సినీ అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటం తో ఈ సినిమా గురించి ఈ వార్త ఆసక్తిగా మారింది. ఈ షో మొదలవక ముందు నుంచే అభిమానులు అక్కడికి వచ్చి నిలవడం ఓక ఎత్తు అయితే షో మొదలయ్యాక థియేటర్లో నాటు నాటు పాట వచ్చిన వెంటనే షో ప్రదర్శించిన ప్రదేశాన్ని వాళ్ళు రచ్చ రచ్చగా మార్చేశారు.
దీంతో మన తెలుగు రాష్ట్రాల్లో చూసిన హంగామా అక్కడ ఒక్కసారిగా రాజమౌళికి కనిపించింది. ఇక దీంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తానిఅయితే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ముగ్గురు కలిసి తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా మరో లెవల్ కు తీసుకువెళ్లారని చెప్పాలి.
#RRRMovie fans ran to the front of the theater for “Naatu Naatu” while director S. S. Rajamouli watched the film. #RRRforOscars #OscaRRRs https://t.co/rG2BiaGyHT pic.twitter.com/l4TpXsg0qu
— Los Angeles Times (@latimes) October 1, 2022