వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్న దర్శకుడు చందు మొండేటి. 2014లో నిఖిల్ హీరోగా కార్తికేయ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. మరి ఇప్పుడు నిఖిల్ హీరోగా కార్తికేయకి సీక్వల్ గా కార్తికేయ 2 ని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలై నిఖిల్ కెరియర్ లోనే సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో మంచి వసూళ్లు వచ్చాయి.
ప్రధానంగా ఈ సినిమా బాలీవుడ్ ను షేక్ చేసింది. బాలీవుడ్లో కేవలం రెండు లక్షల రూపాయల ఓపెనింగ్ తో మొదలైన ఈ సినిమా తర్వాత ఏకంగా రు. 50 కోట్ల నెట్ వసులు సాధించింది అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమాలో హీరోగా నటించిన నిఖిల్ కు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకి దర్శకుడుగా ఉన్న చందు మొండేటి పేరు కూడా అదే స్థాయిలో మారుమోగిపోయింది. అతడితో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నాడు అంటే ఆయన రేంజ్ ఎలా ఉందో తెలుస్తోంది.
చందు మొండేటి తన తర్వాతి సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేయనున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన కథ కూడా చందు మొండేటి పూర్తి చేశాడు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించాలని చందు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ బడా హీరో హృతిక్ రోషన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
చందు మొండేటి హృతిక్ రోషన్ కి కథ కూడా చెప్పాడు. కథ నచ్చడంతో హృతిక్ రోషన్ ఒకే చెప్పినట్టు తెలుస్తుంది. త్వరలోనే గీతా ఆర్ట్స్ లో చందు మండేటిి దర్శకత్వంలో హృతిక్ రోషన్ నటించడం ఖారారైనట్టే. దీంతోచందు మొండేటి తన ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్టు వేసుకున్నాడని చెప్పవచ్చు.