మ‌ళ్లీ ఒక‌టి కాబోతున్న ధ‌నుష్-ఐశ్వ‌ర్య.. ఈ ట్విస్ట్ అస్స‌లు ఊహించి ఉండ‌రు..?

సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీల పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ గా జరుగుతున్న విషయాలు. అయితే ఒక్కొక్కరు రెండేసి మూడేసి పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అసలు విషయానికొస్తే ఇటీవల కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్ – ఐశ్వర్య‌లు విడాకులు తీసుకుంటున్నారని సంయుక్త ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసినదే. ఒక్కసారిగా ఆ ప్రకటనతో అభిమానులందరికీ షాక్ ఇచ్చారు.

ధనుష్ – ఐశ్వర్య 2004లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 18 ఏళ్ల పాటు కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లితండ్రులయ్యాక ఈ విడాకుల నిర్ణయం అందర్నీ బాధించింది. ఇక వీరిద్దరూ విడిపోయినా తర్వాత సోషల్ మీడియాలో తమ పేర్లతోపాటు కలిసి ఉన్న ఫోటోలు కూడా మార్చుకున్నారు. ఇక దీంతో మళ్లీ వీరిద్దరూ కలవరిని అందరూ ఫిక్స్ అయ్యారు.

ఇటీవల స్కూల్లో జరిగిన ఓ ఫంక్షన్ కి వారిద్దరూ పిల్లల కోసం కలిసి హాజరవ్వగా ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూశాక ఈ జంట యధావిధిగా కలిసి ఉంటే బాగుంటుందని వారి అభిమానులు కోరుకుంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఐశ్వర్య – ధనుష్ ఇద్దరు మళ్లీ కలవబోతున్నారట. అయితే వారి పెద్దలు సమస్యను పరిష్కరించగా ఇక వీరిద్దరూ విడాకుల ప్రతిపాదనను విరమించుకున్నట్లు స‌మాచారం.

ధనుష్ – ఐశ్వర్య వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఈ విషయంపై త్వరలోనే అధికారకంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక మ‌ళ్లీ ఒక‌టి కాబోతున్న ధ‌నుష్-ఐశ్వ‌ర్య.. అంటూ అభిమానులు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.