క్రేజీ న్యూస్.. ఆ యువ హీరోలు బాలకృష్ణ షోలో సందడి చేయబోతున్నారా…!

నందమూరి బాలకృష్ణ ఆహలో ఈ సంవత్సరం మొదటిలో అన్ స్టాపబుల్ షో తో ఎంతో వినోదాన్ని పంచారు. ఆ షో తో బాలకృష్ణ యువతలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2 రాబోతుంది. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి క్రియేట్ చేశారు. ఈ సీజన్లో మొదటి ఎపిసోడ్కి గెస్ట్‌లుగా చంద్రబాబు- లోకేష్ రాబోతున్నారు. ఇప్పటికే వీరితో జరిగే ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఈ ఎపిసోడ్ ఈ నెల‌ 14న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Nara Chandra Babu Naidu and NBK combination excite fans! - NTV English |  Latest News | NTV News Channel

ఇప్పుడు ఈ షో కి మరో ఎపిసోడ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వార్త ఏమిటంటే ఓ ఎపిసోడ్లో యువ హీరోలైన విశ్వక్ సేన్‌, సిద్దు జొన్నల గడ్డతో ఓ ఎపిసోడ్ చేయబోతున్నార‌ని. ఈ ఎపిసోడ్‌ షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోలో శరవేగంగా జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ యువ హీరోలు యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక వీరిద్దరితో బాలయ్య టాక్ షో అంటే మరో లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది.

OTT Platform Ends The Plan Of Two Telugu Heroes! - TeluguZ.com

వీరితో పాటు వచ్చే ఎపిసోడ్లో ఎన్టీఆర్- కొరటాల, ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ కూడా అన్ స్టాపబుల్ సీజన్ 2 లో కనిపించనున్నారు. కాన్ని అనుకోని కారణాలవల్ల బాలకృష్ణ వీరితో ఇంటర్వ్యూలు చేయడానికి ఒప్పుకోలేదని తెలుస్తుంది.