అన్ స్టాపబుల్ 2లో రోజా.. బాలకృష్ణ ఏమన్నాడంటే..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సీజన్ 2 మొదలై సూపర్ హిట్ క్రేజ్ తో దూసుకుపోతుంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ కి చంద్రబాబు- లోకేష్ లు గెస్ట్ లుగా వచ్చి అందరి కి షాక్ ఇచ్చే విధంగా అలరించారు. ఇక ఇప్పుడు రెండో ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ కి యువ హీరోలు విశ్వక్ సేన్- సిద్దు జొన్నలగడ్డలు గెస్టులుగా వచ్చారు. ఇప్పుడు మూడో ఎపిసోడ్ గురించి సోషల్ మీడియాలో పలువురు పేర్లు హల్ చల్ చేస్తున్నాయి.

Nara Chandrababu Naidu to Grace Unstoppable with NBK Season 2

వారిలో ముందుగా రమ్యకృష్ణ- రాశి ఖన్నా పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక అయితే ఇప్పుడు ఈ షోలో జరగబోయే ఓ ఎపిసోడ్ కి వైసిపి మినిస్టర్ సినీ హీరోయిన్ రోజాను గెస్ట్ గా పిలవాలని బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.దీనికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ప్రస్తుత రాజకీయాలు అని తెలుస్తుంది. రోజాను గెస్ట్ గా పిలవాలని బాల‌య్య‌ అభిమానులు సోషల్ మీడియా వ్యాప్తంగా పోస్టులు పెడుతున్నారు.

అందులో వారు బాలయ్య.. రోజాతో ప్రస్తుత రాజకీయాల గురించి ప్రస్తావించాలని కూడా అడుగుతున్నారు. ఈ కాంబో సాధ్యమవుతుందా అని కూడా డౌట్లు వస్తున్నాయి. ఈ మధ్యనే రోజా బాల‌య్య‌ ను కూడా వదలకుండా నోటికివ‌చ్చిన‌టు విమర్శించింది. మరి ఈ నేపథంలో బాలయ్య షోకి రోజా గెస్ట్ గా వస్తుందా..? వస్తే మాత్రం ఆ ఎపిసోడ్ కి సాధారణ ప్రేక్షకుల నుండి రాజకీయ నాయకులు వరకు అందరూ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. రోజా-బాలయ్య ఎపిసోడ్ జరుగుతుందో లేదో తేలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!