ప్రభాస్ లానే భాగ్యశ్రీతో క్రష్ ఉందన్న మరో హీరో..!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లైగర్’ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాను అతి భారీగా విడుదల చేస్తున్నారు. అందుకోసం హీరో, హీరోయిన్లు విజయ్, అనన్య పాండే సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా విజయ్, అనన్య పాండేతో కలిసి ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘డిఐడి సూపర్ మామ్స్’కు హాజరయ్యాడు. ఈ షోకు రెమో డిసౌజా, భాగ్యశ్రీ, ఊర్మిళ మటోండ్కర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు..


ఈ వేదికపై హీరో విజయ్ దేవరకొండ తన మనసులోని మాటను బయటికి చెప్పేశాడు. ఇద్దరు వెటరన్ హీరోయిన్లు భాగ్యశ్రీ, ఊర్మిళలపై తనకున్న ప్రేమ గురించి ఓపెన్ గా చేప్పేశాడు.. ‘నేను ఊర్మిళ మేడమ్ తో పాటు భాగ్యశ్రీ మేడమ్ కి వీరాభిమానిని. ఇప్పటి వరకు వారి నటనను నేను చూశాను. నాకు చిన్నప్పటి నుంచి ఊర్మిళ మేడమ్, భాగ్యశ్రీ మేడమ్ లపై ప్రేమ ఉంది. ఇప్పటికీ వారిపై క్రష్ కలిగి ఉన్నాను’ అంటూ విజయ్ దేవరకొండ చెప్పారు.. కాగా, ఇంతకు ముందు కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తనకు భాగ్యశ్రీపై క్రష్ ఉందని అన్నారు. తన సినిమా రాధేశ్యామ్ లో భాగ్యశ్రీ నటించారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా భాగ్యశ్రీపై క్రష్ ఉన్నట్లు తన మనసులోని మాటను బయటపెట్టేశారు.

వీరితో పాటు రెమోపై కూడా అభిమానం ఉన్నట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా ‘బట్టమీజ్ దిల్’లో ఆయన కొరియోగ్రఫీకి తాను ఫిదా అయ్యానని తెలిపాడు. మొదటిసారి ఆ పాటను చూసినప్పుడు దీని కొరియోగ్రఫర్ తో కలవాలని అనిపించిందని విజయ్ దేవరకొండ అన్నారు. ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు. కాగా, ఇటీవల బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ కొనసాగుతోంది. బాయ్ కాట్ సెగ ‘లైగర్’ సినిమాను కూడా తాకింది. సోషల్ మీడియాలో ‘బాయ్ కాట్ లైగర్’ ని ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ అభిమానులు ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్నారు. బాయ్ కాట్ లైగర్ కి వ్యతిరేకండా సపోర్ట్ లైగర్ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.