ప‌వ‌న్‌ను అంద‌రూ ఒంట‌రోడ్ని చేసేశారా…!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు వస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ న చేప‌ట్టి కౌలు రైతుల భ‌రోసా యాత్ర ప్ర‌స్తుతం కొన‌సాగుతోంది. అయితే.. దీనిపై ముందుగానే… కొన్ని విశ్లే ష‌ణ‌లు ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా కౌలు రైతుల స‌మ‌స్య‌లుఅనేకం ఉన్నాయ‌ని..ఇ ప్ప‌టికిప్పుడు.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో వెలుగు చూసిన‌వి కావ‌ని.. కొంద‌రు మేధావులే చెప్పారు. అంతేకాదు.. స్వామినాథ‌న్ క‌మిటీ చేసిన సూచ‌న‌లు పాటిస్తే.. స‌రిపోతుంద‌ని అంటున్నారు.

అయితే.. వీటి వ్య‌వ‌హారం.. కేంద్రంలో ఉంది. వీటిని అమ‌లు చేస్తే.. బాగానే ఉంటుంది. కానీ, అమ‌లు చేసే నాధుడు క‌నిపించ‌డం లేదు. వీటిపై ప‌వ‌న్ నోరు విప్పితే.. జాతీయ‌స్థాయిలో ఆయ‌న‌కు మంచి పేరు వ‌స్తుం ది. పైగా.. ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది. కానీ, కొండంత స‌మ‌స్య‌ను చిన్న‌పాటి అద్దంలో చూపుతూ.. ప‌వ‌న్ చేస్తున్న విమ‌ర్శ‌ల వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని.. వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలావుంటే.. జ‌న‌సేన అధినేత చేప‌ట్టే.. కార్య‌క్ర‌మాల‌కు మంచి ఫాలోయింగ్ ఉంటుంది.

ఆయ‌న‌కు అనుకూలంగా.. టీడీపీ వామ‌ప‌క్షాలు కూడా గ‌ళం వినిపిస్తుంటాయి. గ‌తంలో అమ‌రావ‌తి విష‌యం లో కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ విష‌యంలో ప‌వ‌న్‌కు అనుకూలంగా వారు వ్య‌వ‌హ‌రించారు. కానీ, ఇప్పుడు కౌలు రైతుల భ‌రోసా విష‌యంలో మేధావి వ‌ర్గం కూడా.. ప‌ట్టించుకోవ‌డం లేదు. క‌నీసం.. ప‌వ‌న్ పక్షాన మ‌ద్ద‌తుగా వ్యాఖ్య‌లు కూడా చేయ‌డం లేదు. ఎందుకంటే.. కౌలు రైతుల స‌మ‌స్య‌.. ఎప్పుడూ ఉండేదే. అయితే.. వారికి భ‌రోసా ఇవ్వ‌డం త‌ప్పుకాదు. కానీ, ఈ రైతుల ఆత్మ‌హత్య‌లు గ‌తంలో జ‌ర‌గ‌లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డాన్నే వారు త‌ప్పు బ‌డుతున్నారు.

అంతేకాదు.. ఈ విష‌యంలో ఇత‌ర పార్టీల నాయ‌కులు ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడే ప‌రిస్థితి కూడా లేకుం డా పోయింది. ఎందుకంటే.. వారు ఇప్పుడు నోరు విప్పితే.. గ‌త చంద్ర‌బాబు పాల‌న‌పై నా మాట్లాడాలి. దీంతో ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. కేవ‌లం .. రూ.ల‌క్ష ఇస్తున్నారు కాబ‌ట్టి.. ఈ కార్య‌క్రమం హైలెట్ అయిందనే కామెంట్లు కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.