ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’ మరో 10 రోజుల్లో థియేటర్లలో రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమాను పూర్తి పీరియాడికల్ ఫిక్షన్ సబ్జెక్ట్తో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తాడు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ను చిత్ర యూనిట్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.
ఈ ప్రమోషన్స్లో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి దర్శకుడు రాజమౌళి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి జక్కన్నను కొందరు అడగ్గా, ఈ సీక్వెల్పై క్లారిటీ ఇచ్చాడు ఈ స్టార్ డైరెక్టర్. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కేవలం ఒక్క సినిమాగా మాత్రమే అనుకుని తీశామని, దీనికి ఎలాంటి సీక్వెల్ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. అయితే బాహుబలి సినిమా కంటే కూడా ఆర్ఆర్ఆర్ సినిమా భారీగా ఉంటుందని జక్కన్న చెప్పుకొచ్చారు.
మొత్తానికి RRR చిత్రంపై ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలను ఏమాత్రం తగ్గకుండా చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ను నిర్వహిస్తోంది. ఇక ఈ సినిమాను మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్, ఆలియా భట్, ఒలివియా మారిస్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెత్తో నిర్మించారు.