జయసుధకు కాఫీలో మోషన్ టాబ్లెట్ కలిపి ఇచ్చారు.. షాకింగ్ నిజం బయటపెట్టిన మేక రామకృష్ణ?

మేక రామకృష్ణ.. ఈ నటుడు దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడే. కేవలం సినిమాల్లోనే కాదు ఎన్నో సీరియల్ లో కూడా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇటీవలే మేక రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పట్లో ఇండస్ట్రీ లో జరిగిన అరాచకాలను ఎంతోమంది నటీనటులు ఎదుర్కొన్న చేదు అనుభవాలను వివరించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. సెట్స్ లో ఆర్టిస్టులను ఎంతో దారుణంగా చూసేవారు అంటూ షాకింగ్ నిజాలు బయటపెట్టాడు మేక రామకృష్ణ. సినిమా ప్రొడక్షన్ బాయ్స్ చిన్న ఆర్టిస్టులను చూసే విధానం చూస్తే మనసు తరుక్కుపోతు ఉంటుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

షూటింగ్లో ఫుడ్ పెట్టే దగ్గర 4,5 కేటగిరీలను కేటాయిస్తారని… మనకు కేటాయించిన కేటగిరీకి కాకుండా మరో కేటగిరి లోకి వెళ్తే అసలు మనం మనుషులమే కాదేమో అన్న ఇది నీచంగా చూస్తారని ఇలా సినిమాల్లో ఎంతో మంది చిన్న నటులు ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కోన్నారు అంటూ మేక రామకృష్ణ చెప్పుకొచ్చారు.

ఇక ప్రొడక్షన్ బాయ్స్ ని ఎవరినైనా తిడితే ఇక కాఫీ లో మోషన్ టాబ్లెట్ లు కలిపి ఇస్తూ ఉంటారు. ఏకంగా హీరోయిన్ జయసుధ గారికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది అంటూ బాంబు పేల్చాడు మేక రామకృష్ణ. ఒకానొక సమయంలో జయసుధకు టాయిలెట్ లో ఉన్న నీళ్లను మంచినీళ్లు అంటూ చెప్పి ఇచ్చారని ఇలా ఒక్కరికి కాదు ఎంతో మంది జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు.

ఒకసారి సెట్ లో ఉన్న ఎనిమిది మందితో భోజనం చేయడానికి కూర్చున్న వాళ్లందరికీ వేడి భోజనం పెట్టి నాకు మాత్రం బయట నుంచి తెచ్చిన సపరేటు రైస్ పెట్టారు. నాకు కూడా అదే పెట్టొచ్చుగా అంటే మీకు అంత రేంజ్ లేదు అంటూ అందరి ముందు అవమానించారు ప్రొడక్షన్ బాయ్స్.. అలా అనడటంతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అంటూ చెప్పుకొచ్చాడు మేక రామకృష్ణ కానీ ఇవన్నీ దర్శక నిర్మాతలకు తెలియవు అంటూ చెప్పుకొచ్చాడు.