టాలీవుడ్లో బడా నిర్మాతగా పేరొందిన డి.రామానాయుడు తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విక్టరీ వెంకటేష్.. సొంత టాలెంట్తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్ను దక్కించుకున్నాడు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించిన వెంకీ.. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇక ఈయన తన సినీ కెరీర్లో ఎంత మంది హీరోయిన్లను టాలీవుడ్ కి పరిచయం చేయారు. మరి ఆ హారోయిన్లు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వెంకటేష్ తొలి చిత్రం `కలియుగ పాండవులు` సినిమా ద్వారా ఖుష్బూ టాలీవుడ్కు పరిచయం అయింది.
2.ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వంలో వెంకీ నటించిన `విజేత విక్రం` సినిమా టబు అక్క ఫరా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది.
3.వెంకటేష్ నటించిన `బొబ్బిలి రాజా` సినిమాతో దివ్యభారతి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
4.వెంకటేష్ హీరోగా తెరకెక్కిన కూలీ నెం. 1 సినిమాతో టబు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
5.`సుందరకాండ` సినిమాతో వెంకీ అపర్ణను పరిచయం చేశాడు.
6. వెంకటేష్ నటించిన `ధర్మచక్రం` మూవీతో ప్రేమ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
7. వెంకీ హీరోగా తెరకెక్కిన `సాహసవీరుడు సాగరకన్య` సినిమాతో శిల్పాశెట్టి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
8.‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాతో వెంకటేష్ వినీతను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
9. వెంకటేష్ `నువ్వు నాకు నచ్చావ్` సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది ఆర్తి అగర్వాల్.
10. వెంకీ హీరోగా తెరకెక్కిన ‘లక్ష్మీ’ సినిమాతో నయనతార టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఇక వీరే కాకుండా రితికా సింగ్, కత్రినా కైఫ్, నమిత, ట్వింకిల్ ఖన్నా, ప్రీతి జింతా, అంజలా ఝవేరి, ప్రతిభ సిన్హాలను కూడా వెంకీనే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.