టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మళయాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్గా కనిపించబోతున్నాడు. సునీల్, అనసూయ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ పాన్ ఇండియా చిత్రం రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప.. ది రైజ్` విడుదలకు ముస్తాబవుతోంది.
డిసెంబర్ 17న ఈ చిత్రంలో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్.. పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా ఒక్కో అప్డేట్ను వదులుతూ సినిమాపై భారీ హైప్ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే డిసెంబర్ 12న పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్ యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించబోతున్నారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నాక ఎవరో ఒక స్టార్ హీరో స్పెషల్ గెస్ట్గా రావడం కామన్. కానీ, బన్నీకి మాత్రం ఎవరూ అక్కర్లేదుట. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. పుష్ప ప్రీ రిలీజ్ వేడుకను స్పెషల్ గెస్టు లేకుండానే నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించిందట.
గత ఏడాది కూడా ఏ గెస్ట్ లేకుండానే బన్నీ తన సినిమా ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్నాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఇప్పుడు కూడా పుష్ప ఈవెంట్కి ఎవర్నీ గెస్ట్గా ఆహ్వానించలేదట. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.