బాల‌య్య దెబ్బ‌కు బెదిరిపోయిన కీర్తి సురేష్‌..గుర్రుగా ఫ్యాన్స్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ న‌టించిన తాజా చిత్రం `గుడ్ ల‌క్ స‌ఖీ`. ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పడిరి నిర్మించారు.

ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం కీర్తి సురేష్ అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ గుడ్ ల‌క్ స‌ఖీని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డిసెంబ‌ర్ 10న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సెన్సార్‌ను కూడా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ `యు` సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది.

అయితే మ‌రో నాలుగు రోజుల్లో విడుద‌ల అనంగా.. ఇప్పుడు ఈ చిత్రం వాయిదా ప‌డింది. డిసెంబర్‌ 31న రిలీజ్‌ చేయబోతున్నట్టు తాజాగా మేక‌ర్స్ అధికారంగా వెల్లడించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర బాల‌య్య‌, బోయ‌పాటి కాంబోలో తెర‌కెక్కిన ‘అఖండ’ చిత్రం ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

నాలుగు రోజులు గడిచినా బాక్సాఫీస్ వ‌ద్ద అఖండ జోరు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. స‌త్య‌దేవ్‌- నిత్రా మీన‌న్‌లు న‌టించిన `స్కైలాబ్`, మోహ‌న్ లాల్ న‌టించిన `మరక్కార్` చిత్రాలు అఖండ‌కు పోటీగా దిగి అడ్ర‌స్ లేకుండా పోయాయి. అందుకే బాల‌య్య దెబ్బ‌కు బెరిరిపోయిన కీర్తి సురేష్‌.. వెన‌క్కి త‌గ్గి త‌న సినిమాను వాయిదా వేసుకుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే గుడ్ ల‌క్ స‌ఖీ వాయిదా ప‌డ‌టంపై కీర్తి సురేష్ ఫ్యాన్స్ కాస్త గుర్రుగా ఉన్నారు.