ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్తో తన 15వ చిత్రం చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.
ఇటీవలె ఫస్ట్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వరలోనే సెకెండ్ షెడ్యూల్కి కూడా వెళ్లబోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా దుబాయ్ నుంచి వస్తూ హైదరాబాద్ హెయిర్ పోర్టులో మీడియా కంటపడ్డాడు చరణ్. దీంతో ఆయన ఫొటోలను క్లిక్మనిపించాడు కెమెరామెన్లు. ఈ ఫొటోల్లో బ్లూ కలర్ టీ షర్ట్ ధరించిన చరణ్ సూపర్ స్టైలిష్గా కనిపిస్తూ ఫ్యాన్స్ను, నెటిజన్లను ఫిదా చేశారు.
దీంతో చరణ్ తాజా ఫొటోలతో పాటు.. ఆయన ధరించిన టీ షర్ట్ కూడా నెట్టింట ట్రెండింగ్ గా మారింది. ఎందుకంటే, ఆ టీ షర్ట్ ధర తెలిస్తే ఎవ్వరికైనా మైండ్బ్లాక్ అవ్వుద్ది. అవును, చరణ్ ధరించిన టీషర్ట్ `గుస్సీ` కంపెనీకి చెందినది. ఈ టీ షర్ట్ స్నేక్ స్టాంప్ గ్రాఫిక్, క్య్రూనెక్ కలిగి ఉంది. ఇక దీని ధర 890 డాలర్లు అంటే అక్షరాల 66వేలు. ఈ నేపథ్యంలోనే ఆయన టీ షర్ట్ నెట్టింట వైరల్గా మారింది.