చ‌ర‌ణ్‌-శంక‌ర్ మూవీపై న‌యా అప్డేట్‌..!

ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌`ను పూర్తి చేసుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. త‌న 15వ చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యానర్ పై భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Ram Charan and Shankar's multilingual film starts shoot | The News Minute

ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లె పూణెలో ప్రారంభం అవ్వ‌గా.. తాజాగా ఫ‌స్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నాడు చ‌ర‌ణ్‌. ఈ విషయాన్ని ట్విట్ట‌ర్ ద్వారా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేర‌కు ఓ ఫొటోను సైతం షేర్ చేసింది.

Image

పూనే, స‌తారా, పాల్‌ట‌న్ ప్రాంతాల్లో స్పెష‌ల్ సీక్వెన్స్‌ల‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రించార‌ని స‌మాచారం. ఇక సెకెండ్ షెడ్యూల్ కూడా త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. కాగా, పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది చివ‌ర్లో విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

https://twitter.com/SVC_official/status/1455844727455043584?s=20