పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయక్`. నిత్యా మీనన్, సంయుక్తి మీనన్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా నైజాం రైట్స్ రికార్డు ధరకు అమ్ముడయ్యాయట.
భీమ్లా నాయక్ నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏకంగా రూ.40 కోట్లకు కొనుగోలు చేశారని తెలుస్తోంది. కాగా, మలయాళంలో సూపర్ హిట్టైన `అయ్యప్పనుమ్ కోషియుమ్`కి రీమేక్గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నాడు.