టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజను బాలయ్య వదిలేలా కనిపించడం లేదు. అసలు విషయం ఏంటంటే.. రవితేజ, డైరెక్టర్ రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `ఖిలాడి`. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ మూవీ మే 28న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
మరోవైపు బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న `అఖండ` చిత్రాన్ని సైతం ఆ తేదినే రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా రెండు చిత్రాలు వాయిదా పడ్డాయి. ఇక ఇప్పుడు ఖిలాడిని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ఓ డేట్ ఫిక్స్ చేసుకున్నారట.
అయితే ఇప్పుడు ఖిలాడి విడుదల కాబోయే తేదికే బాలయ్య నటిస్తున్న అఖండను కూడా రిలీజ్ చేయనున్నారని ఓ టాక్ బయటకు వచ్చింది. మరి నిజంగా అదే జరిగితే.. బాక్సాఫీస్ వద్ద బాలయ్య, రవితేజల మధ్య వార్ జరగడం ఖాయమని అంటున్నారు.