టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయిన బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజా చిత్రం `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్`. అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు.
ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల కాబోతుండగా.. నిన్న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ ఈవెంట్ పూజా హెగ్డే నిర్మాత అల్లు అరవింద్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. స్టేజ్పై ఆమె మాట్లాడుతూ.. `నాకు ఇష్టమైన నిర్మాత అల్లు అరవింద్. అయితే నాలుగు రోజుల క్రితం నేను కారులో షూటింగ్కు వెళ్లుండగా.. ఒక మెసెజ్ వచ్చింది.
పైన నోటిఫికేషన్లో అల్లు అరవింద్ గారు అని కనిపించింది. ఆయన మామూలుగా అయితే మెసెజ్ చేయరు. దాంతో ఏం చేశారు? ఎందుకు చేశారు? అని తెగ భయపడ్డాను. ఆ సమయంలో వణుకు పుట్టేసింది. ఇక వెంటనే మెసేజ్ ఓపెన్ చేయగా.. అందలో ఎంతో బాగా నటించావ్.. అని ప్రశంసలు కురిపించారు. అలా ఆయన స్థాయికి ఆ మెసెజ్ చేయాల్సిన పని లేదు. కానీ ఆయన చేశారు. నాకు ఎంతో సంతోషంగా అనిపించింది` అంటూ చెప్పుకొచ్చింది.