ఒక్క మెసెజ్‌తో పూజాహెగ్డేను వ‌ణికించిన‌ అల్లు అర‌వింద్‌..ఏమైందంటే?

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే తాజా చిత్రం `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్`. అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణ‌లో బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు.

With Vijay's Beast, life has come full circle, says Pooja Hegde: Interview - Movies News

ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15న విడుద‌ల కాబోతుండ‌గా.. నిన్న హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ పూజా హెగ్డే నిర్మాత అల్లు అర‌వింద్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. స్టేజ్‌పై ఆమె మాట్లాడుతూ.. `నాకు ఇష్టమైన నిర్మాత అల్లు అరవింద్. అయితే నాలుగు రోజుల క్రితం నేను కారులో షూటింగ్‌కు వెళ్లుండ‌గా.. ఒక‌ మెసెజ్ వచ్చింది.

Allu Aravind Clarifies The Rumours On Covid-19 -

పైన నోటిఫికేషన్‌లో అల్లు అరవింద్ గారు అని కనిపించింది. ఆయన మామూలుగా అయితే మెసెజ్ చేయరు. దాంతో ఏం చేశారు? ఎందుకు చేశారు? అని తెగ భయపడ్డాను. ఆ స‌మ‌యంలో వ‌ణుకు పుట్టేసింది. ఇక వెంట‌నే మెసేజ్ ఓపెన్ చేయ‌గా.. అంద‌లో ఎంతో బాగా నటించావ్.. అని ప్రశంసలు కురిపించారు. అలా ఆయన స్థాయికి ఆ మెసెజ్ చేయాల్సిన పని లేదు. కానీ ఆయన చేశారు. నాకు ఎంతో సంతోషంగా అనిపించింది` అంటూ చెప్పుకొచ్చింది.