టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన కూడా రాగా.. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించబోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్గా మారింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమాలో పూజాతో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందట.
ఆ హీరోయిన్ పాత్ర కోసం త్రివిక్రమ్.. మోడల్, మిస్ ఇండియా మీనాక్షి చౌదరిని దింపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంప్రదింపులు సైతం పూర్తి అయ్యాయని సమాచారం. కాగా, `ఇచట వాహనములు నిలుపరాదు` టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం రవితేజ సరసన ఖిలాడి మూవీతో నటిస్తోంది. అలాగే మీనాక్షి చేతిలో మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నట్టు టాక్.