‘మా’ ఎలక్షన్స్ పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించే నట్లు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే మా ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా ఆ వేడి మాత్రం చల్లారడం లేదు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి చెందిన సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేయడంతో పాటు మోహన్ బాబు, నరేష్, మంచు విష్ణు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే వీరికి మంచు విష్ణు ప్యానెల్ కి చెందిన నరేష్ కౌంటర్ ఇచ్చారు.

తాజాగా ఇవాళ ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేసిన నటి హేమ మా ఎన్నికల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.మా ప్యానల్ రాత్రి విజయం సాధించిందని.. పొద్దున్నకల్లా ఓడిపోయిందని.. మధ్యలో ఏం జరిగిందో అమ్మ వారికే తెలుసంటూ కామెంట్స్ చేశారు. ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నటి హేమ దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

దుర్గమ్మను దర్శించుకున్న తర్వాత ఎంతో సంతోషంగా ఉందని తెలిపిన హేమ..ప్రతి దసరాకు తాను విజయవాడకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటానని తెలిపింది. 10వ తేదీన మా ఎలక్షన్స్ లో జరిగిన తర్వాత రాత్రి తమ ప్యానల్ గెలిచిందని, ఆ తర్వాత ఉదయం ఓడిపోయిందని వ్యాఖ్యానించింది. ఆ ఎన్నికల కౌంటింగ్ లో ఏం జరిగిందో ఇక అమ్మవారికే తెలియాలని చెప్పింది.

మా ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. విష్ణు కు 381 ఓట్లు రాగా, ప్రకాష్ రాజ్ కు 274 ఓట్లు వచ్చాయి. అలాగే ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి చెందిన 11 మంది సభ్యులు విజయం సాధించగా..విష్ణు ప్యానెల్ కు చెందిన ఏడుగురు సభ్యులు మాత్రమే విజయం సాధించారు. దీంతో అమ్మాయి ఎన్నికల కౌంటింగ్ సక్రమంగా జరగలేదని యాంకర్ అనసూయ ఇదివరకే వ్యాఖ్యానించగా తాజాగా నటి హేమ ఎన్నికల కౌంటింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.