అఖండ రైట్స్ ను అన్ని కోట్ల తో సొంతం చేసుకున్న దిల్ రాజు?

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం అఖండ. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ‘అఖండ’ను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తమన్ బాణీలు అందిస్తుండగా, సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా నైజాం రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘అఖండ’ సినిమా నైజాం హక్కులను దక్కించుకోవడానికి దిల్ రాజు 19 కోట్లు పెట్టినట్లు తెలుస్తోంది.

లెజెండ్, సింహా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా అఖండ.ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక పాత్రలో అఘోరాగా, మరొక పాత్రలో సాధారణ వ్యక్తిగా కన్పించబోతున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు అలాగేనందమూరి అభిమానులు భారీ గా అంచనాలు పెట్టు కున్నారు. బాలయ్య నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోంది.