ప‌వ‌న్ విష‌యంలో మెగాహీరోలు మౌనం.. కార‌ణం అదేనా?

`రిప‌బ్లిక్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టికెట్ రేట్లు, ఆన్‌లైన్ అమ్మ‌కాలు త‌దిత‌ర విష‌యాల్లో ఏపీ ప్ర‌భుత్వంపై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో ప‌వ‌న్‌పై వైఎస్ఆర్‌సీపీ నేత‌, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాంతో ప‌వ‌న్‌, పోసాని మ‌ధ్య వార్ నెల‌కొన‌గా.. ఇప్పుడా వార్ మ‌రింత ముదురుతోంది.

Posani krishna Murali vs Pawan Kalyan : Enters Filthy Zone

పోసాని వ‌రుస ప్రెస్ మీట్లు పెడుతూ హ‌ద్దులు దాటేసి మ‌రీ ప‌వ‌న్‌ను విమ‌ర్శిస్తున్నాడు. మ‌రోవైపు ప‌వ‌న్ సైతం ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. అయితే ప‌వ‌న్ ఇండస్ట్రీ కోసమే వాదిస్తున్నా.. సినీ పెద్ద‌లెవ‌రూ ఆయ‌న‌కు స‌పోర్ట్‌గా నిల‌వ‌డం లేదు. మ‌రోవైపు మెగా హీరోలు సైతం ప‌వ‌న్ విష‌యంలో మౌనాన్నే పాటిస్తున్నారు. గ‌త రెండు రోజులుగా ఎక్క‌డ చూసినా ప‌వ‌న్‌-పోసానిల‌పైనే క‌థ‌నాలు క‌నిపిస్తున్నాయి.

Chiranjeevi, All Mega Heroes and Akira in One Frame

అయిన‌ప్ప‌టికీ ఏ మెగా హీరోనూ పోసానిని తిట్టడం కానీ పవన్ ని సపోర్ట్ చేయడం కానీ చేయలేదు. తాజ‌గా ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన నాగబాబు.. పోసాన‌ని కుక్క‌తో పోల్చారే త‌ప్ప ఈ విష‌యంలో పెద్ద‌గా స్పందించ‌లేదు. దాంతో ఎంద‌రు మెగా హీరోలు సైలెంట్‌గా ఉంటున్నార‌నే ప్ర‌శ్న అంద‌రిలోనూ మొద‌లైంది. అయితే ఇందుకు కార‌ణం చిరంజీవినే అని టాక్ న‌డుస్తోంది. ప‌వ‌న్ కు స‌పోర్ట్ చేస్తూ మాట్లాడితే సినీ ఇండ‌స్ట్రీ మొత్తం ఇబ్బందుల్లో ప‌డుతుంద‌నే ఉద్ధేశంతోనే చిరు.. మెగా హీరోలంద‌రికీ ఈ విష‌యంపై స్పందించ‌వ‌ద్ద‌ని తెలిపారట‌. అందు వ‌ల్ల‌నే మెగా హీరోలు మౌనంగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.