అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ కలిసి నిర్మించారు.
ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు.
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ చిత్రం మళ్లీ వాయిదా పడిందట. ఈ సినిమాను పండుగకు ముందు కాకుండా విజయదశమి రోజునే రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. అంటే అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.