`అఖండ‌`పై న్యూ అప్డేట్‌..ఇక మిగిలింది అదేన‌ట‌..!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుంటే.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు.

Boyapati talks about Akhanda release date - tollywood

అలాగే ఎస్‌. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాల‌య్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఈ సినిమా మేజర్ షూటింగ్ పార్ట్ మొత్తం ఫినిష్ అయింది. ఇక కేవలం హాస్పిటల్ సీక్వెన్స్ మాత్రమే మిగిలి ఉంద‌ని.. ఈ హాస్పిటల్ సీక్వెన్స్ సినిమాలోనే హెవీ ఎమోషనల్ గా సాగుతుంద‌ని తెలుస్తోంది.

Akhanda' climax being shot in Tamil Nadu

అంతేకాదు, ఈ సీక్వెన్స్ మొత్తం బాలయ్య అఘోరా పాత్ర చుట్టూ సాగుతుంద‌ని స‌మాచారం. ఇక త్వర‌లోనే దీనిని కూడా పూర్తి చేసేసి.. నిర్మాణ ప‌నులు స్టార్ట్ చేయ‌నున్నార‌ట‌. కాగా, ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13న‌ విడుద‌ల కానుందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.