అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు సెప్టెంబర్ 24న విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ సెప్టెంబర్ 19న సాయంత్రం హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్కు ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు స్పెషల్ గెస్ట్లుగా విచ్చేయబోతున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హరోలు ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి ఒకరు కాగా.. మరొకరు టాలీవుడ్ కింగ్ నాగార్జున.
అలాగే వీరితో పాటుగా మరో స్టార్ డైరెక్టర్ కూడా ఈ ఈవెంట్కి రాబోతున్నట్లు సమాచారం. అక్కినేని ఫ్యాన్స్ ఎప్పటికీ గుర్తుంచుకునేలా చాలా గ్రాండ్గా ఈ ఈవెంట్ జరగబోతోందని ప్రచారం జరుగుతోంది. కాగా, ఇటీవల విడుదలైన లవ్ స్టోరీ ట్రైలర్ ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్లో దుమ్ముదులుపుతూ భారీ వ్యూస్తో దూసుకుపోతోంది.