గత రెండు రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి మధ్య వార్ నెలకొన్న సంగతి తెలిసిందే. టికెట్ల రేట్లు, ఆన్లైన్ అమ్మకాల విషయంలో పవన్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో.. వైఎస్ఆర్సీపీ నేత అయిన పోసాని పవన్ను టార్గెట్ చేస్తూ నానా బూతలతో వాయించేస్తున్నారు.
దాంతో మీడియాలో ఎక్కడ చూసిన పోసాని, పవన్ ల గురించే కథనాలు వస్తున్నాయి. అయితే తాజాగా వీరిద్దరిపై నటుడు బాబూమోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ` ఇద్దరూ(పవన్-పోసాని) కలిసి కళామతల్లి పరువు తీయకూడదు. సర్కారు సహకారం ఇండస్ట్రీకి అవసరం. ప్రభుత్వాన్ని ఇండస్ట్రీనే ఓ విషయం అడిగింది. దీనిపై పవన్ కల్యాణ్ ఏదేదో మాట్లాడి వివాదాలకు తెర లేపారు.
అందుకే ఇండస్ట్రీ సైడా? ప్రకాశ్ రాజ్ సైడా? అని పవన్ ను విష్ణు బాబు ప్రశ్నించారు. ఏది ఏమున్నా తెరచాటునే అన్ని విషయాలు తేల్చుకోవాలి. అంతేగానీ, తెరముందుకు వచ్చి మాట్లాడడం ఏంటీ? వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవడం వల్ల మన పరిశ్రమ పరువుపోతోంది. అంత పెద్ద అన్యాయమే జరిగితే పెద్ద మనుషుల దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి` అని ఆయన హితవు పిలికారు. దాంతో ఇప్పుడు బాబుమోమన్ కామెంట్స్ వైరల్గా మారాయి.