సర్కారు వారి పాట సినిమా మీదే ఆధారపడిన అల్లు అర్జున్..?

అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో వరుస సక్సెస్ లు మీద ఉన్నాడు. తను చేసే సినిమాలోని కథ విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో తీస్తున్న పుష్ప సినిమా కూడా రెండు విభాగాలుగా ఉండడంతో కథ నచ్చి చేస్తున్నాడు ఈయన. ఇక వాకిల్ సాబ్ డైరెక్ట్ చేసిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో కూడా మరొక సినిమాను చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇలా మంచి కంటెంట్లను తీసుకొని తన సినిమాలను హిట్ చేసుకుంటున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈయన కొంత మంది దర్శకులతో కథ వింటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే కొంతమంది దర్శకులను తన ఓకే చెప్పినట్లు ఆ డైరెక్టర్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బన్ని తో పరశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఎక్కువగా వినిపిస్తోంది.

అయితే ఈ సినిమా పట్టాలు ఎక్కాలంటే సర్కారు వారి పాట సినిమా మంచి సక్సెస్ చేసినందుకు ఉంటే ఈ సినిమాని అల్లుఅర్జున్ చేసే అవకాశం ఉన్నట్లు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఒకవేళ ఆ సినిమా కమర్షియల్ గా మంచి హిట్ సాధించిన ఈ సినిమాని పరశురామ్ తో చేయాలని చూస్తున్నాడట అల్లు అర్జున్. ఇక ఇంతకుముందే ఈయన గీతా ఆర్ట్స్ పై ఒక సినిమా చేయాల్సి ఉంది.

మహేష్ బాబుతో సినిమా అయిపోయిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కి ఇస్తారని ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఇంతకు ముందే గీత గోవిందం లాంటి సక్సెస్ ఇచ్చిన తర్వాత మహేష్ బాబు సినిమా అని ఒప్పుకోవడం గమనార్హం. ఇక ఇప్పటికే విడుదలైన సర్కారీ వారి పాట టీజర్ ను చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్బస్టర్ అయ్యేలా ఉందని సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది.

ఇదే కనుక నిజమైతే అల్లు అర్జున్ నుండి పిలుపు రావడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని 2023 వ సంవత్సరం చివర్లో పట్టా లెక్కించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక పుష్ప సినిమాను కూడా వచ్చే నెలలో షూటింగ్ పూర్తి చేసుకున్న ట్లు సమాచారం.