వెనకంజలో ఎన్టీఆర్ ..ఫ్యాన్స్ లో అసహనం !

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ఆర్ఆర్‌`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. డీవివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఒక‌టి, రెండు పాట‌లు మిన‌హా.. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది.

Vijayendra Prasad addresses RRR controversies, says SS Rajamouli film  'cannot be compared to Baahubali' | Entertainment News,The Indian Express

అయితే ఈ పాన్ ఇండియా మూవీ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర‌ణ్ మాత్ర‌మే ఎక్కువ‌గా హైలైట్ అయ్యాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న త‌రుణంలో చరణ్ పీఆర్ బృందం రంగంలోకి దిగి తమ హీరోను భారీగా ప్రమోట్ చేశారు. దాంతో ఆర్ఆర్ఆర్ చరణ్ చిత్రమే అని నేషనల్ స్థాయిలో టాక్ వ‌చ్చేసింది.

N. T. Rama Rao Jr. - Wikipedia

వాస్త‌వానికి త‌మ‌ను తాము పాన్ ఇండియా స్థాయిలో నిరూపించుకోవడానికి ఇటు ఎన్టీఆర్ కు గానీ అటు రామ్ చరణ్ కు గానీ ఇంతకంటే మంచి అవ‌కాశం మ‌రొక‌టి దొర‌క‌దు. ఇక ఈ అవ‌కాశాన్ని చ‌ర‌ణ్ బాగానే స‌ద్వినియోగం చేసుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంటున్నారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం ఈ విష‌యంలో బాగా ఎనుక‌బడ్డాడు. దాంతో ఆయ‌న అభిమానులు కూడా కాస్త అస‌హ‌నంగా ఉన్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఇప్ప‌టికైనా ఎన్టీఆర్ మేలుకుని.. హైలైట్ అవుతాడో లేదో చూడాలి.