నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో.. అఖండపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నాడు.
నిజానికి ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకెండ్ వేవ్ దాపరించడంలో.. షూటింగ్కు బ్రేక్ పడింది. ఇక ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం ఫైనల్ షెడ్యూల్ పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీ అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్టు ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు ఈ ప్రచారమే బాలయ్య అభిమానులు కలవరపెడుతోంది. దానికి కారణం అక్టోబర్ 13న రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కాబోతుండటమే. రాజమౌళి సినిమాతో పోటీ పడటం అంటే మన సినిమాపై ఆశలు వదిలేసుకోవడమే. అంత ధైర్యం ఎవరూ చేయరు. అందుకే ఆయన సినిమా విడుదలైన దరి దాపుల్లో ఏ సినిమా విడుదల కాదు. కానీ, ఇప్పుడు అఖండను అక్టోబర్ 8న రిలీజ్ చేస్తున్నారని టాక్ బయటకు రావడంతో.. బాలయ్య ఎందుకింత రిస్క్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.