టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్.
ఇక ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్.. వెంటనే గోవాలో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ తాజా షెడ్యూల్ గోవాలో స్టార్ అయింది. ఈ నేపథ్యంలోనే మహేష్ గోవా వెళ్లాడు. అయితే ఒక్కడే కాదండోయ్.. వెంట ఫ్యామిలీని కూడా తీసుకెళ్లాడు. నిజానికి విదేశాలలో సినిమా షూటింగ్స్ ఉంటే మహేష్ తప్పకుండా తన ఫ్యామిలీని తీసుకెళుతుంటారు.
అక్కడ ఓ వైపు సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు ఫ్యామిలీతో చక్కర్లు కొడుతూ ఉంటాడీయన. తాజాగా కూడా గోవాకు ఫ్యామిలీతో వెళ్లిన మహేష్.. ఓవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ఫ్యామిలీతో చార్టర్డ్ ఫ్లైట్లో గోవా అందాలను ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పిక్స్ వైరల్గా మారాయి. మొత్తానికి ఒకేసారి ఇటు షూటింగ్, అటు వెకేషన్ రెండూ కానిచ్చేస్తున్నాడు.