కోలీవుడ్ రాక్ స్టార్ యశ్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `కేజీఎఫ్-2`. గతంలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన కేజీఎఫ్-1కు కొనసాగింపుగా కేజీఎఫ్-2ని రూపొందించారు. యష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి నటించగా.. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ 2 ఎప్పెడెప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ సినిమా విడుదలకు లాక్ చేసిన డేట్ను తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ చిత్రాన్ని 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ రూపంలో మేకర్స్ వెల్లడించారు. కాగా, ఈ చిత్రం జూలైలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా వల్ల పరిస్థితులు పూర్తిగా తారుమారు కావడంతో చిత్రాన్ని వాయిదా వేశారు. డిసెంబర్లో విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, మేకర్స్ ఈ సినిమా విడుదలను వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేశారు. దీంతో కేజీఎఫ్ 2ను చూడాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే.
https://twitter.com/TheNameIsYash/status/1429381892646707200?s=20