మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే ఈ నెల 22న చిరంజీవి బర్త్డే అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆచార్య నుంచి కొత్త పోస్టర్తో పాటు కుదిరితే టీజర్ను కూడా విడుదల చేయనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి బర్త్డే కంటే ముందే ఆచార్య న్యూ పోస్టర్ లీకై నెట్టింట వైరల్గా మారింది.
ధర్మస్థలి దగ్గర ఉన్న చిరంజీవి పిక్ ఇది. అనధికారికంగా బయటకి వచ్చిన ఈ పోస్టర్ ప్రస్తుతం మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. కాగా, ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.