రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టార్.. ఇందులో నిజమెంత?

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి వరుసగా భారీ మల్టీస్టారర్ లతో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొడుతున్నారు. ఇంతకుముందు ప్రభాస్, ప్రాణాలను బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్లను చేశాడు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ లుగా ఆవిష్కరిస్తున్నారు. వీరిద్దరి తర్వాత మహేష్ బాబు ని పాన్ ఇండియా స్టార్ ని చేస్తారు. ఇక మహేష్ బాబు కూడా తన తరువాత చిత్రాన్ని రాజమౌళితో చేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

అంతేకాకుండా రాజమౌళి అల్లు అర్జున్ కలయిక కోసం కొన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రాజెక్టు కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఎట్టకేలకు మరొకసారి అల్లు అరవింద్ ఒక బృహత్తర ప్రణాళికతో ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఈసారి రామ్ చరణ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ ను నిర్మించాలనేది అరవింద్ ప్లాన్. అందుకు రాజమౌళి ఓకే చెబితే భారీ ప్యాకేజీలు చెల్లించేందుకు ఆఫర్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై రాజమౌళి ఏ విధంగా స్పందిస్తారు అనేదే అధికారికంగా క్లారిటీ రాలేదు.