లోకల్ ట్రైన్ లో ఓ వ్యక్తి అక్క‌డ తాకాడ‌ట‌..నాని హీరోయిన్ ఆవేద‌న‌!

సామాన్యుల మాదిరిగానే సినీ తార‌ల జీవితాల్లోనూ ఎన్నో స‌మ‌స్య‌లు ఉంటాయి.. మ‌రెన్నో చేదు అనుభ‌వాలూ ఉంటాయి. వాటిని కొంద‌రు బ‌య‌ట పెడ‌తారు.. మ‌రికొంద‌రు త‌మ‌లోనే దాచుకుంటూ కుమిలిపోతుంటారు. అయితే తాజాగా యంగ్ హీరోయిన్ అదితి రావు హైదరీ త‌న లైఫ్‌లో జ‌రిగిన ఓ చేదు సంఘ‌ట‌న‌ను అంద‌రితోనూ పంచుకుంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

Aditi Rao Hydari Reveals Three Months in lockdown Made her Anxious | Filmfare.com

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అతిది.. తాను చ‌దువుకునే రోజుల్లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ను అంద‌రితోనూ షేర్ చేసుకుంది. `ఓ సారి లోకల్ ట్రైన్ లో వెళ్తుండ‌గా.. ఓ వ్య‌క్తి తనను తాక‌కూడ‌ని చోట తాకాడు. మొద‌ట పొర‌పాటున జ‌రిగిందేమో అని భావించాను. కానీ, స‌ద‌రు వ్య‌క్తి మ‌ళ్లీ మ‌ళ్లీ అలాగే చేస్తుండ‌డంతో.. అత‌డి చెంప ప‌గ‌ల‌గొట్టి ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చాను` అని అదితి చెప్పుకొచ్చింది. అలాగే ఈ సంద‌ర్భంగా ప్ర‌తి త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆమె పేర్కొంది.

Aditi Rao Hydari on 'Ajeeb Daastaans': "I wanted to step out of my comfort zone"

కాగా, హైదరాబాదీ అయిన అదితి.. మొద‌ట మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో అధిక చిత్రాలు చేసి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అలాగే తెలుగులో సుధీర్ బాబు స‌ర‌స‌న సమ్మోహనం, నాని స‌ర‌స‌న వి, వ‌రుణ తేజ్ స‌ర‌స‌న అంతరిక్షం వంటి చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇక ప్ర‌స్తుతం ఈ బ్యూటీ మ‌హాస‌ముద్రం, హే సినామిక చిత్రాల్లో న‌టిస్తోంది.