మెగస్టార్ చిరంజీవికి తన తనయుడు రామ్ చరణ్ తలనొప్పిగా మారడం ఏంటీ..? అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నిజానికి ఈ చిత్రం మేలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో.. విడుదల ఆగిపోయింది. కరోనా సెకెండ్ వేవ్ తర్వత ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక మిగిలిన చిన్న చిన్న పనులను పూర్తి చేసేసి.. దసరాకు సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావించారు.
అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని దసరా(అక్టోబర్ 13)కు విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా కన్ఫామ్ చేసేశారు. దేశప్రజలందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం థియేటర్లో దిగితే.. మిగిలిన చిత్రాలన్నీ సైడ్ అవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే దసరా బరిలో నుంచి ఆచార్య తప్పుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చరణ్ మూవీ కారణంగా చిరు సినిమా విడుదల మరింత ఆలస్యం కాబోతోందన్నమాట.