మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సాయి తేజ్.. తక్కువ సమయంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వంలో ఈయన నటించిన రిపబ్లిక్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇదిలా ఉంటే.. తాజాగా సాయి తేజ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫాలోవర్స్తో చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్లో నెటిజన్లు అడిగిన అన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్.. మీ నాన్నతో ఉన్న ఓ ఫొటో షేర్ చేయమని అడిగితే… అమ్మతో స్టేజీ నుంచి దిగుతున్న ఫొటో పోస్ట్ చేశారు.
అంతే తనకు నాన్న కూడా అమ్మే అని పరోక్షంగా చెప్పకనే చెప్పాడు సాయి తేజ్. కాగా, సాయి ధరమ్ తేజ్ చిన్న వయసులోనే వాళ్ల అమ్మానాన్న విడిపోయారు. అప్పటి నుంచి వాళ్ల అమ్మగారే అన్నీ తానై సాయి ధరమ్ తేజ్, అతడి సోదరుడు వైష్ణవ్ తేజ్లను పెంచి పెద్ద చేశారు. అయితే ఆ తర్వాత సాయి తేజ్, వైష్ణవ్ ఇద్దరూ కలిసి తల్లి విజయ దుర్గను ఒప్పించి.. 2011లో ఆమెకు రెండో వివాహం చేశారు. సాయి తేజ్ రెండో తండ్రి ఓ కంటి డాక్టర్. ప్రస్తుతం అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు.