రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సలార్. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
ఇక జనవరిలో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని.. సెకెండ్ షెడ్యూల్కి వెళ్లేలోపే కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడింది. దాంతో షూటింగ్కు బ్రేక్ పడింది. ప్రస్తుతం కరోనా అదుపులోకి వస్తుండడంతో.. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధం అవుతోంది.
ఇదిలా ఉంటే..సలార్ నుంచి మరో లీక్ బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ లోనే ఓ మేకింగ్ వీడియో బయటకి లీక్ కాగా.. ఇప్పుడు ఓ బైక్ మీద ప్రభాస్ కనిపిస్తున్న ఫోటోలు మరియు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు సమాచారం. ఇక ఈ లీకుల విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ యూనిట్ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని.. అలాగే మరిన్ని కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది.