విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం నారప్ప. తమిళంలో హిట్ అయిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
కరోనా పరిస్థితుల కారణంగా ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో జూలై 20న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వెంకీ ఫ్యాన్స్కు ఓ అదిరిపోయే గుడ్న్యూస్ చేప్పారు మేకర్స్. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..ఈ సినిమా అనుకున్న దానికంటే ముందుగానే విడుదల కానుంది.
అవును, ఇండియాలో జులై 19 రాత్రి 10 గంటల నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. అంటే అసలు టైమ్ కంటే రెండు గంటల ముందే ప్రేక్షకుల ముందుకు వెంకీ రాబోతున్నాడు. ఇక యూఎస్లో రాత్రి 12.30 నిమిషాల నుంచి నారప్ప అందుబాటులోకి రానుంది.