గత ఏడాది తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన `ఆహా`.. అనతి కాలంలోనే యమా క్రేజ్ సంపాదించుకుంది. కేవలం సినిమాలు, వెబ్ సిరీస్లకే పరిమితం కాకుండా ఇంటర్వ్యూలతో పాటు పలు సరికొత్త కార్యక్రమాలతో దూసుకుపోతోంది.
ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా `ఆహాః భోజనంబు` పేరుతో వంటల ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయబోతోంది. ఈ షోకు హోస్ట్గా మంచు లక్ష్మి రంగంలోకి దిగబోతోంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ మేరకు విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంటోంది.
సెలబ్రెటీల తో ఈ వంటల కార్యక్రమాని నిర్వహించబోతున్నారు. సెటబ్రెటీల చేత వంటలు చేయిస్తూ.. వారితో ముచ్చట్లు పెట్టి మంచు లక్ష్మి సందడి చేయనుందని తెలుస్తోంది. కాగా, త్వరలోనే ఈ ప్రోగ్రామ్ ఆహాలో ప్రసారం కానుంది.