కోలీవుడ్ రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం కేజీఎఫ్2. బాక్సాఫీస్ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్కు సీక్వెల్గా వస్తోందీ సినిమా. షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
అయితే ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. తాజాగా కేజీఎఫ్-2 మూవీ దక్షిణాది భాషల ఆడియో హక్కులు ఏకంగా రూ.7.2 కోట్లకు అమ్ముడయ్యాయి. లహరి మ్యూజిక్, టీ సిరీస్ కలిసి ఈ హక్కులను కొనుగోలు చేశాయి.
ఆడియో హక్కులకే ఏడు కోట్లంటే అదీ ఓ రికార్డే అని చెప్పాలి. కాగా, ఈ చిత్రం జూలైలో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా అడ్డుపడింది. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.