సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `అయ్యప్పనుం కోషియం` రీమేక్. సితార ఎంటర్టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో పవన్కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తోంది.
ఇక కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లగా.. ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ మొత్తంలో అమ్ముడుపోయాయట.
బాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ దాదాపు 23 కోట్లకు ఈ మూవీ రైట్స్ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందట. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రానప్పటికీ.. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం జోరుగా ప్రచారం జరుగుతొంది. కాగా, సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంలో పవన్ భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్గా నటిస్తుండగా.. రానా అతడిని ఢీకొట్టే రిటైర్డ్ ఆర్మీ ఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.