కాకినాడ వ‌స్తున్న చిరంజీవి..ఎందుకోస‌మంటే?

మెగాస్టార్ చీరంజీవి త్వ‌ర‌లోనే కాకినాడ రాబోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈయ‌న కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

మ్యాట్నీ ఎంటర్‌న్మెంట్స్ బ్యానర్స్‌తో కలిసి రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇక ఇటీవ‌లె ఈ చిత్రం మ‌ళ్లీ సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను కాకినాడలో ప్లాన్‌ చేశారని తెలుస్తోంది.

ఈ కాకినాడ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటుగా సోనూసూద్ కూడా జాయిన్ కానున్నార‌ట‌. మూడు నుంచి ఐదు రోజులు జరగనున్న ఈ షెడ్యూల్‌లో చిరు, సోనూల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నార‌ని టాక్‌. కాగా, మ‌రికొన్ని రోజులు షూటింగ్ పూర్తి కానున్న ఈ చిత్రం ద‌స‌రా బ‌రిలో దిగ‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.