మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారుడు.
అలాగే కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. నక్సలిజం నేపథ్యంతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా ప్రభావం వలన కొన్నిరోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తుండడంతో.. నేడు మళ్లీ ఆచార్య షూటింగ్ రీస్టార్ట్ అయింది.
ఈ లాస్ట్ షెడ్యూల్లో చిరంజీవి, చరణ్ ఇద్దరూ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. వీరిద్దరిపై కొన్ని కీలమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక ఈ నెల చివరికి ఈ షెడ్యూల్ పూర్తవుతుందని.. ఆగస్టులో నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతాయని అంటున్నారు. కాగా, ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.