విద్యాబాల‌న్‌ ” షేర్నీ” ట్రైల‌ర్ విడుదల

బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ నటించిన కొత్త చిత్రం ‘షేర్నీ’. త్వరలోనే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ ​ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో అటవీశాఖ అధికారిణి పాత్రలో విద్యాబాలన్​ కనిపించనున్నారు. ఏడాది తర్వాత ఆమె నుంచి వస్తోన్న చిత్రం కావడం వల్ల ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘న్యూటన్​’ ఫేమ్​ అమిత్​ మసుర్కర్​ ‘షేర్నీ’ సినిమాకు దర్శకత్వం వహించారు. మనిషి-జంతువుల మధ్య జరిగే సంఘర్షణ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అమెజాన్​ ప్రైమ్ ద్వారా ప్రేక్షకులముందుకు రానుంది. జూన్​ 2న ఈ చిత్ర ట్రైలర్​ విడుదల కానుంది. ఈ సినిమాకు భూషణ్​ కుమార్​, కృష్ణన్​ కుమార్​, విక్రమ్​ మల్హోత్రా, అమిత్​ మసుర్కర్​ నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే విద్యాబాలన్ సినిమా అంటే ఏదో ఒక ఆసక్తికర పాయింట్ తోనూ వస్తారని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో విద్యాబాలన్ షేర్నీగా వచ్చి ప్రేక్షకులను అలరిస్తారో లేదో వేచిచూడాల్సిందే.