బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించిన కొత్త చిత్రం ‘షేర్నీ’. త్వరలోనే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో అటవీశాఖ అధికారిణి పాత్రలో విద్యాబాలన్ కనిపించనున్నారు. ఏడాది తర్వాత ఆమె నుంచి వస్తోన్న చిత్రం కావడం వల్ల ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘న్యూటన్’ ఫేమ్ అమిత్ మసుర్కర్ ‘షేర్నీ’ సినిమాకు దర్శకత్వం వహించారు. మనిషి-జంతువుల మధ్య జరిగే సంఘర్షణ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకులముందుకు రానుంది. జూన్ 2న ఈ చిత్ర ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమాకు భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, అమిత్ మసుర్కర్ నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే విద్యాబాలన్ సినిమా అంటే ఏదో ఒక ఆసక్తికర పాయింట్ తోనూ వస్తారని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో విద్యాబాలన్ షేర్నీగా వచ్చి ప్రేక్షకులను అలరిస్తారో లేదో వేచిచూడాల్సిందే.