బాల‌య్య సినిమాని రిజెక్ట్ చేసిన ర‌కుల్‌..కార‌ణం అదేన‌ట‌?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. షూటింగ్ చ‌వ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య క్రాక్‌తో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని ఫామ్‌లోకి వ‌చ్చిన గోపిచంద్ మాలినేనితో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాలయ్య ఇమేజ్‌కు తగ్గ కథను వినిపించి ఓకే చేయించుకున్నాడు గోపీచంద్‌. ఇక వీరి కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం ఈ చిత్రం కోసం హీరోయిన్‌ను వెతికే ప‌నిలో ప‌డ్డాడు గోపీచంద్.

ఈ మ‌ధ్య శ్రుతిహాస‌న్‌ను తీసుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఆమె సలార్‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్ల నో చెప్పింద‌ట‌. దీంతో గోపీచంద్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌ను సంప్ర‌దించ‌గా.. ఆమె కూడా నో చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. హిందీ ప్రాజెక్టుల కారణంగా డేట్లు కుదరడం లేదని.. సున్నితంగా బాల‌య్య సినిమాను రిజెక్ట్ చేసింద‌ని టాక్‌.