క్రిష్ సినిమాకు ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకే?!

ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ప్ర‌స్తుతం విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు క్రిష్ జాగర్లమూడి తెర‌కెక్కిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు ప‌వ‌న్ పుచ్చుకునే రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమాకు ప‌వ‌న్ రూ.50 కోట్లు పారితోష‌కంగా తీసుకుంటున్నార‌ని టాక్ న‌డుస్తోంది. ఇదే నిజ‌మైతే.. ప‌వ‌న్‌ కెరీర్ అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకున్న సిన‌మాగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లునే నిలుస్తుంద‌ని అంటున్నారు. ఇక పూర్తిగా సెట్స్ లోనే నిర్మితమవుతున్న ఈ సినిమాకి వీఎఫెక్స్ ఎఫెక్ట్స్ హైలెట్ గా నిలవబోతున్నాయని, ఆ గ్రాఫిక్ వర్క్ కోసం మ‌రో 50 కోట్లు ఖర్చుపెడుతున్నారని తెలుస్తోంది.